Share News

విలువలతో కూడిన విద్య కావాలి

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:52 PM

మార్కులు ర్యాంకులు ప్రధానమైనవి కావని, విలు వలతో కూడిన విద్య అందినప్పుడే విద్యార్ధికి భవిష్యత్‌ ఉంటుందని విద్యా శాఖ జిల్లా సెక్టోరల్‌ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు.

విలువలతో కూడిన విద్య కావాలి

కోటపల్లి, ఏప్రిల్‌ 23: మార్కులు ర్యాంకులు ప్రధానమైనవి కావని, విలు వలతో కూడిన విద్య అందినప్పుడే విద్యార్ధికి భవిష్యత్‌ ఉంటుందని విద్యా శాఖ జిల్లా సెక్టోరల్‌ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సెలవుల్లో విద్యార్థులు చే యాల్సిన కృత్యాలు, తల్లిదండ్రులు గమనించాల్సిన అంశాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రోగ్రెస్‌ కార్డులు అందించారు. ప్రిన్సిపాల్‌ లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 10:52 PM