Home » Telangana » Adilabad
లోక్సభ ఎన్నికల ప్రక్రియ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా కోడ్ అమల్లో ఉండటంతో దాదాపు రెండు నెలల పాటు రిజి స్ట్రేషన్లు అరకొరగా జరగగా, ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ల సమయం లోనూ అదే పరిస్థితి నెలకొంది. నగదు లావాదేవీలపై ఆధారపడ్డ రియల్ రంగంలో ప్రస్తుతం భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా, వినియోగదారులు లేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతు న్నాయి.
వారంతా భూమి పుత్రులు. ఎలాంటి భూమి లేని కారణంగా మట్టిని నమ్ముకొని భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే. అదే వ్యవసాయం.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్ర మేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శనివారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి బాల్క సుమన్ జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లా డుతూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా ల్లో కొత్త పుంతలు తొక్కి దేశానికే బీఆర్ఎస్ పార్టీ దిశానిర్ధేశంగా నిలిచిందన్నారు.
బెజ్జూరు, ఏప్రిల్ 27: దేశానికి చేసింది, చేసేది చెప్ప లేక రాజకీయాలకోసం బీజేపీ దేవున్ని వాడుకుంటున్న దని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం బెజ్జూరు మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు.
గోదావరి, ప్రాణహిత తీరాన్ని దాటి ఏను గుల గుంపు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సదస్సులో అటవీ శాఖ రేంజర్ రవి, ఎంపీడీవో ఆకుల భూమన్న, పశు వైద్యాధికారి పవన్కుమార్, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులకు, వాలంటీర్లకు, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
తెలంగాణలో మార్చినట్లే దేశం లోనూ ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, నస్పూర్లో శని వారం రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద సభ, ఎన్నికల ప్రచార సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 27: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా నివారిం చడానికి శనివారం సాయంత్రం 4నుంచి 6గంటలవరకు ఎస్పీ ప్రత్యేకడ్రైవ్ నిర్వహించారు.
సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధు లను పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధా రణ పరిశీలకులు రావేష్ గుప్తా అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ అశోక్కుమార్, ప్రత్యే క ఉపపాలన అధికారి చంద్రకళతో కలిసి సూక్ష్మ పరిశీకుల ర్యాండమైజే షన్ ప్రక్రియ నిర్వహించారు.
కౌటాల, ఏప్రిల్ 27: రాష్ట్రంలోని వినియోగ దారులకు నాణ్యతగల కరెంటు అందించేం దుకు కృషిచేస్తున్నా మని ట్రాన్సుకో సీఎండీ(నార్తర్న్పవర్ డిస్ట్రిబ్యూషన్) కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శనివారం కౌటాల మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 27: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే13న నిర్వహించే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు కృషిచేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్ని కల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్ అన్నారు.