Share News

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌లో వరుస దొంగతనాలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:05 PM

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 26: కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో శుక్రవారంరాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. పట్టణంలోని మున్నీ బార్‌అండ్‌రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్టు పట్టణ సీఐ శంకరయ్య తెలిపారు.

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌లో వరుస దొంగతనాలు

- మున్నీ బార్‌అండ్‌రెస్టారెంట్‌లో రూ.3లక్షలు

- భట్టుపల్లిలో మూడున్నర తులాల బంగారం, రూ.50 వేలు చోరీ

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 26: కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో శుక్రవారంరాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. పట్టణంలోని మున్నీ బార్‌అండ్‌రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్టు పట్టణ సీఐ శంకరయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మున్నీ బార్‌అండ్‌రెస్టారెంటులోని కౌంటర్‌ గదిపై భాగంలో ఉన్న రేకులను తొలగించి లోనికి ప్రవేశించి కౌంటర్‌లోని రూ.3లక్షలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. ఈ మేరకు డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీంను రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. మున్నీ బార్‌అండ్‌రెస్టారెంటు యాజమాని వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అలాగేపట్టణంలోని మరో రెండు చోట్ల కూడా చోరీకి యత్నించారు. మండలంలోని భట్టుపల్లిలో నివాసం ఉంటున్న తోట శోభ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీజరిగినట్టు రూరల్‌ ఎస్సై సోనియా తెలిపారు. ఆమె తెలిపినవివరాల ప్రకారం తోటశోభ కుటుం బసభ్యులంతా ఇంటిపైన పడుకోగా, ఇంట్లోకి చొరబడి మూడున్నర తులాల బంగారం, రూ.50వేలు నగదు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. ఈ మేరకు శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్‌ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీ సంఘటనలపై డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీం వివరాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:05 PM