కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:12 AM
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వస్తేనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
ఎలిగేడు, ఏప్రిల్ 27 : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వస్తేనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం మండలంలోని రాము లపల్లిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వర్గీయ వెంకటస్వామి మనుమడు గడ్డం వివేకానంద కుమారు డు వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గ్రామచెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేయా లని మరోసారి చెప్పారు. పదేళ్లు అధికారం అనుభవిం చిన నరేంద్రమోడీ, రాష్ట్రం బిఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజల కు ఏమి చేయలేదని ఆరోపించారు. మరోసారి బీజేపీ, బఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్ధని సూ చించారు. ప్రస్థుతం రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన 6హామీలలో ఐదిం టిని నెరవేర్చమని, ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న రైతులకు రూ.లక్షలు రుణమాఫీ చేసి వారి చిరకాల వాంఛ నెరవేర్చుతామని పేర్కొన్నారు. ఆయనతో మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, గోదెల శ్రీనివాస్రెడ్డి, కోరుకంటి వెంక టేశ్వర్రావు, తాటిపల్లి రమేష్బాబు, అర్షనపల్లి వెంక టేశ్వర్రావు, పోట్యాల రమేష్, వెంకట్రెడ్డి, సిద్ది తిరు పతి, నరేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.