Home » Telangana » Karimnagar
మంత్రి పొన్నం ప్రభాకర్ తిట్లను దీవెనలుగా భావిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం బోయినపల్లిలో నిర్వహించిన బీజేపీ పన్నా ప్రముఖుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని అందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మిషన్భగీరథ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సూచించారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేండ్లు పరిపాలించినా పవర్లూం నేత కార్మికులు, పద్మశాలి సమాజాన్ని పట్టించుకోలేదని, రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షీ అన్నారు.
కంబోడియా కేంద్రంగా చైనీస్ కంపెనీ పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఏజెంట్ల అరెస్ట్ చేసి మరో ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వస్తేనే సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచే స్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని, వారి సంక్షే మం కోసం కృషి చేస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు.
జిల్లాలోని కథలాపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 120 మంది విద్యా ర్థులుండగా కేవలం 37 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. కళాశాల కేవలం 31శాతం ఉత్తీర్ణతను సాధించింది. ప్రథమ సంవత్సరం లో 157 మంది విద్యార్థులుండగా కేవలం 17 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కేవలం 10.82 శాతం ఉత్తీర్ణతను కళాశాల సాధించింది.