చంద్రరథంపై కొలువుదీరిన సీతారాములు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:07 AM
మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారల ఉత్సవమూర్తులను అర్చకులు చంద్రరథంపై అధిరోహించారు.
ఇల్లందకుంట, ఏప్రిల్ 24: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారల ఉత్సవమూర్తులను అర్చకులు చంద్రరథంపై అధిరోహించారు. సాయంత్రం నిత్యవిధి హోమం, రథబలి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను, చంద్రరథాన్ని ఘనంగా అలంకరించారు. బాజాభజంత్రీలు, మేళాతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ స్వామివారి ఉత్సమూర్తులను చంద్రరథంపై ఆసీనులను చేశారు. రాత్రి 11 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో కందుల సుధాకర్ ఏర్పాట్లు చేశారు.