Share News

నేటి నుంచి ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:20 PM

జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి మే రెండవ తేదీ వరకు ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు డీఈ వో అబ్ధుల్‌ ఘనీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు
పేట సాయి జూనియర్‌ కళాశాలో రూల్‌ నెంబర్లను పరిశీలిస్తున్న డీఈవో అబ్దుల్‌ ఘనీ

నారాయణపేట, ఏప్రిల్‌ 24 : జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి మే రెండవ తేదీ వరకు ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు డీఈ వో అబ్ధుల్‌ ఘనీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ఎనిమి ది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేవారు. ఇందులో పదో తరగతి ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రౌండ్‌ ఉన్నత పాఠశాల, దయానంద విద్యా మందిరంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 649 మం ది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్‌కు సంబంధించి శ్రీ సాయి స్కూల్‌, సాయి జూనియర్‌ కళాశాల, కృష్ణవేణి హై స్కూల్‌, నారా యణ హైస్కూల్‌, బ్రిలియంట్‌ హై స్కూల్‌ ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేయగా, మొత్తం 1179 మంది విదార్థులు పరీక్షలకు హాజరుకా నున్నారు. పరీక్షల నిర్వహణకు ఎనిమిది మంది సీఎస్‌లు, ఎనిమిది మంది డీవోలు, 109 మంది ఇన్విజిలెటర్లు, ఒక ప్లైయింగ్‌ స్కౌడ్‌ బృందం, ఎనిమి ది సిట్టింగ్‌ స్కౌడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయి. కాగా బుధవారం పరీక్షా కేంద్రాల్లో వేసిన రూల్‌ నెంబర్లను డీఈవో అబ్దుల్‌ ఘనీ, కో-ఆర్డీనేటర్‌ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి.

Updated Date - Apr 24 , 2024 | 11:20 PM