Share News

వృథాగా సత్యసాయి పంప్‌ హౌజ్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:06 PM

పదేళ్ల క్రితం మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కొరత తీర్చిన భగవాన్‌ సత్యసాయి తాగు నీటి పంప్‌ హౌజ్‌ ప్రస్తుతం వృథాగా మారడంతో శిథిలావస్థకు చేరుకుంది.

వృథాగా సత్యసాయి పంప్‌ హౌజ్‌
ఐదు పంప్‌లకు ప్రస్తుతం ఉన్న రెండే పంప్‌లు

- మద్యం ప్రియులకు అడ్డాగా మారిన వైనం

- చోరీకి గురైన మోటార్లు, పట్టించుకోని అధికారులు

నర్వ, ఏప్రిల్‌ 27 : పదేళ్ల క్రితం మండలంలోని పలు గ్రామాలకు తాగునీటి కొరత తీర్చిన భగవాన్‌ సత్యసాయి తాగు నీటి పంప్‌ హౌజ్‌ ప్రస్తుతం వృథాగా మారడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో మోటార్లు, పైపులు చోరీకి గురవు తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పంప్‌ హౌజ్‌ పక్కనే వైన్స్‌ షాపులు ఉండటంతో మందు బాబులకు అడ్డాగా మారింది. దీంతో విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి ఉన్న వస్తువులకు రక్షణ కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కాగా భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు పంప్‌ హౌజ్‌లో ఉన్న ఐదు మోటారు పంప్‌లకు గాను ప్రస్తుతం రెండే మోటార్లు కానరావడంతో మిగితా మోటార్లు ఏమైనట్లో అని గుస గుసలాడుతున్నారు. తక్షణమే అధికారులు చ

Updated Date - Apr 27 , 2024 | 11:06 PM