Share News

క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:34 PM

యువతీ యువకులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నియోజక వర్గ ఇన్‌చార్జి సరిత అన్నారు.

క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
క్రీడాకారులతో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల అర్బన్‌, ఏప్రిల్‌ 23 : యువతీ యువకులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నియోజక వర్గ ఇన్‌చార్జి సరిత అన్నారు. పట్టణంలోని బీసీ కాలనీలో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్‌ జయమ్మ కోటేష్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన డీటీపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, ఏదైనా ఒక క్రీడను ఎంచుకుని రాణించాలని సూచించారు. క్రీడాకారులకు తనవంతు సహా యసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు టి.శ్రీనివాసులు, మహేష్‌, జయకృష్ణ, బిల్లర్‌ రామకృష్ణ, నర్సింహులు, గోపాల్‌ వర్మ, స్వామినాయుడు, రాము యాదవ్‌, సాయన్న, కృష్ణయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:34 PM