Share News

4 తులాల బంగారం అపహరణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:19 PM

తాళం వేసిన ఇంటికి కన్నం వేసి నాలుగు తులాల బంగారం అపహరించుకుపోయిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

4 తులాల బంగారం అపహరణ

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఏప్రిల్‌ 27 : తాళం వేసిన ఇంటికి కన్నం వేసి నాలుగు తులాల బంగారం అపహరించుకుపోయిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్‌బోర్డు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రజియాబేగం కుటుంబ సభ్యులతో కలిసి మహబూబ్‌నగర్‌ బంధువుల ఇంటికెళ్లింది. శనివారం ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువా తాళం పగలగొట్టి.. నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 11:19 PM