కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలకు విఘాతం
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:04 PM
కొల్చారం, ఏప్రిల్ 27: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగిందని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు.
బీఆర్ఎ్సతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు
బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు
కొల్చారం, ఏప్రిల్ 27: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగిందని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని దుంపలకుంట చౌరస్తా, రంగంపేట, కొల్చారంలో జరిగిన కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే సంగాయిపేట, చిన్నాఘన్పూర్, పోతంశెట్పల్లి చౌరస్తా, అప్పాజిపల్లి మీదుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట మారుస్తూ రుణమాఫీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నాడని అన్నారు. అలాగే పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేయని మంత్రి హరీశ్రావు రాజీనామా అంటూ కొత్త నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మురళీయాదవ్, బీజేపీ మండలాధ్యక్షుడు పాతూరి దయాకర్గౌడ్, రాంపూర్ మాజీ సర్పంచ్ సామల యాదగిరి, బీజేపీ నాయకులు హరీశ్, గిరి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ మాటలన్నీ నీటి మూటలే!
చిల్పచెడ్, ఏప్రిల్ 27: సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలన్నీ.. నీటి మూటలేనని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఎద్దేవా చేశారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్షో నిర్వహించగా.. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన వాగ్ధానం ఏమైందని గుర్తుచేశారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తానన్న సీఎం ఇంతవరకు అమలు చేశాడా.. అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సేవలు చేసిందన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసిందేనని గుర్తుచేశారు. దేశం సురక్షితంగా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలన్నారు. ప్రజలు పెద్ద మనసుతో నిజానిజాలు గమనించి మాయమాటలకు లోనుకాకుండా బీజేపీకి ఓటేసి.. తనను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మురళీయాదవ్, బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
మోదీకి ఓటేసి గెలిపించాలి
కౌడిపల్లి, ఏప్రిల్ 27: దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్రమోదీకి ఓటేసి గెలిపించాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం శనివారం మండల కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేసిందా.. అని ప్రచారానికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్యాదవ్, జిల్లా నాయకులు ఖాజిపేట రాజేందర్, గోడ రాజేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు రాకే్షతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.