Share News

బీజేపీతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:43 PM

కొండపాక, ఏప్రిల్‌ 22: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి
దుద్దెడలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు

కొండపాక, ఏప్రిల్‌ 22: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. కొండపాక మండలం దుద్దెడలో సోమవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేసిందే.. తప్పా మేలు చేయలేదన్నారు. కొంతమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం కావడంతో ప్రజలు విసిగి వేసారి పోయారని పేర్కొన్నారు. వందరోజులకే కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఏమీ చేయలేకపోతున్నదన్నారు. దేశ భద్రత, దేశాభివృద్ధిలో ప్రపంచ దేశాలు మనదేశం వైపు చూస్తున్నాయని, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం అగ్రరాజ్యాల వరుసలో నిలిచిందని చెప్పారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 11:43 PM