Share News

సమన్వయంతో పనిచేయండి

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:45 PM

జోగిపేట, ఏప్రిల్‌ 22: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సూచించారు.

సమన్వయంతో పనిచేయండి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న దామోదర్‌

సురే్‌షషెట్కార్‌ గెలుపే ధ్యేయం

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

జోగిపేట, ఏప్రిల్‌ 22: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సూచించారు. సోమవారం, జోగిపేటలోని కాగ్రెస్‌ కార్యాలయంలో అందోలు-జోగిపేట కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా మున్సిపల్‌ పరిధిలో కాంగ్రె్‌సకు భారీ ఆధిక్యం సాధించాలన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సురే్‌షషెట్కార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. వచ్చే 25 రోజులు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ వందరోజుల్లో చేపట్టిన అభివృద్ధి, ఆరు గ్యారంటీ పథకాల అమలును వివరించి ఓటర్లను చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పరిధిలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, కార్యర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 11:45 PM