Share News

KTR: ఇన్వర్టర్లు, కొవ్వొత్తులు సిద్ధం చేసుకోండి..రాష్ట్ర ఓటర్లకు కేటీఆర్ సూచన

ABN , Publish Date - May 09 , 2024 | 10:24 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో(lok sabha elections 2024) భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

KTR: ఇన్వర్టర్లు, కొవ్వొత్తులు సిద్ధం చేసుకోండి..రాష్ట్ర ఓటర్లకు కేటీఆర్ సూచన
KTR advice telangana voters

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో(lok sabha elections 2024) భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పోలింగ్ రోజున ప్రజలందరూ కింది ఉత్పత్తులను సిద్ధం చేసుకోవాలని కోరారు. వాటిలో ఆరు గ్యారెంటీలు 1. ఇన్వర్టర్, 2. ఛార్జింగ్ బల్బులు, 3. టార్చ్ లైట్లు, 4. కొవ్వొత్తులు, 5. జనరేటర్లు, 6. పవర్ బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు.


అంతేకాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని, BRS కాదని, మే 13న తెలివిగా ఓటు వేయాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. ఆ క్రమంలో ఓట్ ఫర్ కార్, ఓట్ ఫర్ తెలంగాణ అంటూ పోస్ట్ చేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు కరెంట్ కట్ సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ చెప్పకనే చెప్పారని తెలుస్తోంది.


మరోవైపు కేటీఆర్(KTR) వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వర్షం రాక సహా అనేక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ (congress) నేతలు చెబుతున్నారు. మరి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారో చూడాలి మరి. మే 13న ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.


ఇవి కూడా చదవండి..

Loksabha Polls 2024: నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ


KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 10:30 AM