దేశానికే ఆదర్శంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:13 PM
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో మాట్లాడుతూ.. భారతదేశానికే ఆదర్శంగా అమరావతిలో 2,500 ఎకరాల్లో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’, ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
తిరుపతి, ఆగస్టు 29: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో మాట్లాడుతూ.. భారతదేశానికే ఆదర్శంగా అమరావతిలో 2,500 ఎకరాల్లో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’, ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నాయని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించటంలో భాగంగా సీఎం చంద్రబాబు.. ప్రముఖుల అకాడమీలను ప్రోత్సహిస్తున్నారన్నారు. పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ వంటి ప్రముఖుల అకాడమీలకు ప్రభుత్వం నుంచి స్థల కేటాయించినట్లు చెప్పారు.
అరకు నుంచి తిరుపతి వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు 6 ప్రత్యేక అకాడమీలను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఏ ఈవెంట్ జరిగినా ఏపీ నుంచి కనీసం ఒక క్రీడాకారుడైనా పాల్గొనాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. రాష్ట్రాన్ని ‘హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్’గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని చెప్పుకొచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం(ధ్యాన్చంద్ జయంతి), తెలుగు భాషా దినోత్సవం(గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి) సందర్భంగా తిరుపతి వేదికగా క్రీడాకారులకు మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి మండిపల్లి
రాబోయే 50 ఏళ్లకు సరిపడా అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా(వైజాగ్, అమరావతి, తిరుపతి) విభజన చేసినట్లు తెలిపారు. క్రీడా పరికరాల తయారీ కోసం నెల్లూరు పరిసరాల్లో 1,000 ఎకరాల్లో ‘స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తిరుపతిలో కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిటోరియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ZPHS పాఠశాలల గ్రౌండ్లను సీఎస్సార్(CSR) నిధులతో అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రతిభను వెలికితీసేలా కార్యాచరణను రూపొందించనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
ముళ్లపొదల్లో మహిళ మృతదేహం... ముఖంపై యాసిడ్ పోసి దారుణం
Read Latest AP News And Telugu News