Home » Andhra Pradesh » Visakhapatnam
గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్ల తీర్పు కాస్త భిన్నంగా ఉంటుంది.
ఒకే వార్డు పరిధిలోని ఓటర్లు రెండు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.
వార్డు వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పినా విశాఖపట్నంలో వైసీపీ నాయకులు వదలడం లేదు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది. విశాఖ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల నామినేషన్ల పరిశీలన ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది.
నర్సీపట్నం మండలంలోని వేములపూడికి చెందిన బోళెం గోపాత్రుడు కుటుంబంలో మొదటి తరం నుంచి మూడో తరం వరకూ ఏదో ఒక పదవి చేపట్టి ప్రజా ప్రతినిధులుగా రాణించారు.
తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.
కార్మికులు సమ్మెబాట పట్టడంతో అదానీ గంగవరం పోర్టు బోసిపోయింది.
మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో కూటమి బలంతో సాగనంపుదామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, గిరిజనుల గురించి వైసీపీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అందువల్ల అందరం ఐక్యంగా వైసీపీని తరమాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల శనివారం పాడేరు, అరకులోయ కేంద్రాల్లో రోడ్షో నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి రాజమండ్రిలో బస చేసిన ఆమె శనివారం ఉదయం పాయకరావుపేటలో రోడ్షో ముగించుకుని సాయంత్రం 4 గంటలకు పాడేరు చేరుకుంటారు.