Home » Elections » Lok Sabha
రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.
Telangana: పోలింగ్కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో ఈవీఎంల పంపిణీని జీహేచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
గత పదేళ్ల నుంచి చేసిన పనులే తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహద పడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో అభివృద్ధి పడకేసింది. గత పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు.
ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది గంటలే సమయం ఉంది. పార్టీల అధినేతలంతా టెన్షన్ టెన్షన్గా క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలే అయినా కూడా పార్టీలన్నీ ప్రెస్టీజియస్గానే తీసుకున్నాయి. ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి మరీ ప్రచారం చేయించాయంటే ఎన్నకలను పార్టీలు ఎంత సీరియస్గా తీసుకున్నాయో అర్థమవుతున్నాయి.
లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
Telangana: రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు చేరుకున్న సీఎం.. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మతాల మధ్య మనుషుల మధ్య గొడవలు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఇస్తారేమో అని చూసామని... కానీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని చావాలని..
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: ప్రచారంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్తి నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... క్యాడర్ అందరు కలిసి కట్టుగా పనిచేశారని.. గ్రామస్థాయిలో బాగా ప్రచారం జరిగిందని తెలిపారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాల గురించి తనకే చెప్పారన్నారు.