Home » National
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరఫున శనివారంనాడు ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా రోడ్షో నిర్వహించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యనాడ్ నియోజకవర్గంతో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని అన్నారు.
వరుసగా మూడోసారి నరేంద్ర మోదీని భారత ప్రధానిని చేయాలని దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం పోర్ బందరులో బీజేపీ అభ్యర్థి మనుశుక్ మాండవ్యాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు.
కరువు సహాయక పనుల కోసం కర్ణాటకకు రూ.3,454 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ కరువు ఉపశమనం (ఖరీప్ 2023) కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అసన్సోల్ వెళ్లేందుకు ఆమె హెలికాఫ్టర్ ఎక్కారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.