Home » AP Politics
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ 175 అన్నాడు..అలాంటప్పుడు ఇతరులను వేరే చోటు నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు.
ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసుపై తాజాగా హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని అందులో పిటిషనర్..
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.