Home » Drugs Case
మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే 41 రకాల మందులు, ఆరు రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
విలన్ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
ప్రేమ విఫలమై డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు.. డ్రగ్స్ స్మగ్లర్(Drug smuggler) అవతారమెత్తి స్నేహితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. చివరకు సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సనత్ నగర్లో ఎండీఎంఏ డ్రగ్స్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలో యువకులు డ్రగ్స్ వినియోగించి..
రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ (Radison Hotel) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి మాత్రలు (Extosi pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాద్ డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Daggubati Purandeswari: ఇటీవల విశాఖ తీరంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలియకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నీలి పత్రిక(సాక్షి)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా(Defamation) వేశారు. విశాఖ డ్రగ్స్(Vizag Drugs Case) పట్టివేత వ్యవహారంలో సంధ్య ఎక్స్పోర్ట్స్లో తాము భాగస్వాములు అని..
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఏ తండ్రి అయితే ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో, ఆయన కుమార్తెపైనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది.
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.
సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్ను డ్రగ్గాంధ్రప్రదేశ్గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.