Home » KCR
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్ఎస్(BRS) పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ చేసింది తప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి తానేనని.. అందుకే తనను బయటకు గెంటేశారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
‘‘అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసమర్థులు.. తెలివితక్కువ వారు రాజ్యమేలుతున్నారు.
ఈనెల13న జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం జగన్కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రిటర్స్ గిఫ్ట్ ఇస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండో సారి వైయస్ జగన్ అధికారం అందుకోవాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ.. వైయస్ జగన్కే గెలుస్తారని తమకు అందుతున్న సమాచారమంటూ వివిధ చర్చ వేదికల్లో వారు స్పష్టం చేస్తున్నారు.