Home » YS Jagan
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.
టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండో సారి వైయస్ జగన్ అధికారం అందుకోవాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ.. వైయస్ జగన్కే గెలుస్తారని తమకు అందుతున్న సమాచారమంటూ వివిధ చర్చ వేదికల్లో వారు స్పష్టం చేస్తున్నారు.
తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కు సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం. గెలిచేదెవరు.. ఓడేదెవరు.. చర్చంతా ఇదే. ఈ సమయంలో సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ 10 నివేదికలు పలు సర్వే సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏ ఫలితం చూసినా ఒకేలా ఉండటంతో రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది.
ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలించిపోయారు. చాలిచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీనిచ్చారు.