కళాశాలలో వివాహంపై వాసిరెడ్డి పద్మ స్పందన

ABN , First Publish Date - 2020-12-04T18:20:05+05:30 IST

మైనారిటీ తీరకముందే ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతుందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు

కళాశాలలో వివాహంపై వాసిరెడ్డి పద్మ స్పందన

ప్రకాశం: మైనారిటీ తీరకముందే ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతుందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కళాశాల తరగతుల్లో వివాహం చేసుకున్న సంఘటన చూసి షాక్ అయ్యానని... పెళ్లి అంటే బొమ్మలాట కాదని తెలిపారు. మైనర్ బాలిక, బాలుడు చేసిన ఘటన తప్పైనప్పటికీ బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బాలికతో పాటు బాలికను ఇంటి నుంచి వెలివేసిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని ఆమె తెలిపారు. సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.




దిశ ఏర్పాటు అనంతర పరిస్థితులు.. మహిళలపై జరుగుతున్న, చోటుచేసుకుంటున్న పరిణామాలపై పరిశీలన జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. అన్ని సంఘాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. మహిళలకు అండగా చట్టాలపై ప్రజల్లో గ్రామీణ పట్టణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళల అక్రమ రవాణా.. అక్రమ మత్తు పదార్థాల తరలింపును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

Updated Date - 2020-12-04T18:20:05+05:30 IST