చేతకాని 22 మంది ఎంపీలు ఎందుకు?: లోకేష్

ABN , First Publish Date - 2020-10-30T18:24:40+05:30 IST

ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని..

చేతకాని 22 మంది ఎంపీలు ఎందుకు?: లోకేష్

అమరావతి: ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేట్లు పెరిగాయని, రూ. 55వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పుడు ట్వీట్ రెడ్డి (ఏ2 విజయసాయి) రాజ్యసభలో కేంద్రానికి ప్రశ్న వేశారని, రూ. 55వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారా? అని అడడగ్గా.. ఒప్పుకున్నట్లు చెప్పిందన్నారు. ఇప్పుడు వాళ్ల కేసుల మాఫీ కోసం ఆ నిధులను రూ. 25 వేలకు కుదించారని మండిపడ్డారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తెస్తామని చెప్పిన ట్విట్ రెడ్డి ఏపీకి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్నారు.. ఎందుకని నిలదీశారు. ఎంపీల చేతకాని తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం రూ. 30వేల కోట్లని లోకేష్ అన్నారు.

Updated Date - 2020-10-30T18:24:40+05:30 IST