Home » TOP NEWS
మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని తిరుమలగిరిలో వైసీపీ నాయకుల అత్యుత్సాహం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి రాగా వైసీపీకి చెందిన జెండాలను వెంటనే స్థానిక నాయకుడు తన ఇంటి ముందు కార్యకర్తలతో కట్టించాడు. అయినా సరే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో సి బిజిల్ యాప్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఎండల్లో బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. అయితే అనేక మంది అకౌంట్లు ఇన్ ఆపరేట్లో ఉండటంతో పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పెన్షన్ కోసం పెద్ద సంఖ్యలో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలతో అగచాట్లు పడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు.
లోక్సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది.
64 కళల్లో చోరకళ కూడా ఒకటి అంటారు. అయితే కనీసం ఒంటికి తెలియకుండా ఒంటి మీదున్నవన్నీ వలిచేయడం చోరకళలో ప్రావీణ్యం సాధించిన వారికే తెలిసి ఉంటుందేమో.. తాజాగా ఓ సినీ నిర్మాత ఒంటిపై బట్టలు మినహా మొత్తం వలిచేసుకుని వెళ్లిపోయాడో దొంగ. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది.
పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది.
దుర్గగుడిలో ఒక ఇంజనీరింగ్ అధికారి రాసలీలలు వెలుగు చూశాయి. సదరు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో విచారణకు ఈఓ రామారావు ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన ఛాంబర్కు పిలిపించుకుని.. చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపుతూ వారిని లోబరుచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
అపరిమిత అధికారాలతో కేసీఆర్ చాలా పిచ్చిపనులు చేశారని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో
గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్లో బిల్లా, రంగాలను ఓడించామని.. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్లో మోదీ, అమిత్షాలను ఓడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్లో బీఆర్ఎ్సను బొందపెట్టాం, లోక్సభ ఎన్నికల