ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-11-07T23:08:17+05:30 IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 8,40,730 కరోనా కేసులు నమోదయ్యాయి.
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 8,40,730 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,779 మంది మృతి చెందారు. ఏపీలో 21,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి 8,12,517 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 85.87 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా కృష్ణా 3, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కొత్తగా 50,356 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 577 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 84,62,080కు కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం దేశంలో 5,16,632 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 78,19,886 మంది రికవరీ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.41 శాతం, మరణాల రేటు 1.48 శాతంగా ఉంది.