అనంతపురం జిల్లాలో కలకలం రేగిన చిరుత మృతి
ABN , First Publish Date - 2020-05-17T15:46:07+05:30 IST
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో చిరుత మృతి కలకలం రేగింది. కంబదూరు మండలంలోని అండేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది.
అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో చిరుత మృతి కలకలం రేగింది. కంబదూరు మండలంలోని అండేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. అనారోగ్యంతో చిరుత మృతి చెందిందా..? లేక ఇతర కారణాలపై అధికారులు అరా తీస్తున్నారు.