నలంద విద్యా సంస్థల చైర్మన్
ABN , First Publish Date - 2020-09-06T07:27:06+05:30 IST
ప్రముఖ విద్యావేత్త, నలంద విద్యాసంస్థల చైర్మన్ మంతెన సూర్యనారాయణ రాజు(76) శనివారం గుండెపోటుతో హైదరాబాద్ ఎస్ఆర్
మంతెన సూర్యనారాయణ రాజు మృతి
వెంగళరావునగర్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, నలంద విద్యాసంస్థల చైర్మన్ మంతెన సూర్యనారాయణ రాజు(76) శనివారం గుండెపోటుతో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని స్వగృహంలో మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండ లం ఈడూరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ రాజు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చారు. విద్యపై ఉన్న మక్కువతో వెంగళరావునగర్లో నలంద విద్యా సంస్థలను స్థాపించారు. ఆయనకు భార్య సరస్వతి, కుమారుడు శ్రీనివా్సరాజు, ముగ్గురు కుమార్తెలున్నారు.