పశువుల మేత భూమిలో సచివాలయం
ABN , First Publish Date - 2020-05-12T00:40:02+05:30 IST
ఎస్ఆర్పురం మండలం సీకేపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీకేపురంలో గ్రామ సచివాలయం నిర్మించడం కోసం స్థల పరిశీలన కోసం వెళ్లిన ..
చిత్తూరు: ఎస్ఆర్పురం మండలం సీకేపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీకేపురంలో గ్రామ సచివాలయం నిర్మించడం కోసం స్థల పరిశీలన కోసం వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పశువుల మేత భూమిలో సచివాలయం నిర్మించడానికి వీళ్లేదంటూ ఆందోళనకు దిగారు. ఆత్మహత్య శరణ్యమంటూ ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం కలకలం రేపింది.