ప్రభుత్వానిది కక్షసాధింపు చర్యే: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-10-12T09:20:55+05:30 IST
ఏపీ టిడ్కో నిర్మించిన ఏడు లక్షల ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఇవ్వకపోవడం ముమ్మాటికి
కర్నూలు(న్యూసిటీ)/డోన్, అక్టోబరు 11: ఏపీ టిడ్కో నిర్మించిన ఏడు లక్షల ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఇవ్వకపోవడం ముమ్మాటికి కక్షసాధింపు చర్యేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై నిర్మించిన ఇళ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. డోన్ మండలం సీసంగుంతల గ్రామంలో అధిక వర్షాలతో నష్టపోయిన పంటలను కూడా ఆయన పరిశీలించారు.