గ్యాస్ లీక్..ప్రజలకు ఆందోళన వద్దు: డీజీపీ సవాంగ్
ABN , First Publish Date - 2020-05-09T16:17:52+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ పరిసరాలు సాధారణ పరిస్థితికి వచ్చాయన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని పేర్కొన్నారు.