నేటినుంచి పాఠశాలలకు సెలవులు
ABN , First Publish Date - 2020-04-24T11:45:48+05:30 IST
నేటినుంచి పాఠశాలలకు సెలవులు
చిత్తూరు: ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. దీంతో పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. జూన్ 12న పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా కారణంగా గత నెల 19నుంచి పాఠశాలలు తెరవని సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఆరు నుంచి తొమ్మిదో తర గతి విద్యార్థులను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన విషయం విదితమే.
డిప్యుటేషన్ల రద్దు: సమగ్ర శిక్ష నందు పనిచేస్తున్న వారు మినహా అన్ని రకాల ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర పాఠశాల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఈవో నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.