ఏపీ సీఎం సహాయ నిధికి కేసీపీ భారీ విరాళం
ABN , First Publish Date - 2020-07-28T23:10:55+05:30 IST
కోవిడ్ -19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కేసీపీ లిమిటెడ్ తరఫున కోట రూపాయలు విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సీఎం క్యాంపు
అమరావతి: కోవిడ్ -19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కేసీపీ లిమిటెడ్ తరఫున కోట రూపాయలు విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు కేసీపీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వి. మధుసూదనరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు.