లిస్ట్ ఇస్తే సరుకులు మేమే ఇస్తాం!
ABN , First Publish Date - 2020-03-28T09:02:05+05:30 IST
సరకుల కొనుగోలుకు వచ్చిన వినియోగదారులను లోపలకు అనుమతించడంతో మాల్స్ పక్కగా వ్యవహరిస్తున్నాయి. వినియోగదారులు నిలబడటానికి 3అడుగుల దూరం ఉండేలా
- మాల్స్లో నయా విధానం
విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సరకుల కొనుగోలుకు వచ్చిన వినియోగదారులను లోపలకు అనుమతించడంతో మాల్స్ పక్కగా వ్యవహరిస్తున్నాయి. వినియోగదారులు నిలబడటానికి 3అడుగుల దూరం ఉండేలా బాక్స్లను గీయడమే కాకుండా, వారి నుంచి సరుకుల జాబితాను మాల్స్లో సిబ్బంది ముందుగానే తీసుకుంటున్నారు. దానిపై వినియోగదారుల పేరు, ఫోన్ నంబర్ రాయించుకుంటున్నారు. అనంతరం వారికి టోకెన్ ఇస్తున్నారు. మొత్తం సరుకులను ఒక బుట్టలో వేసిన తర్వాత టోకెన్ నంబర్ ప్రకారం ఆయా వినియోగదారులను పిలుస్తున్నారు. సరుకులన్నీ ఉన్నాయో లేదో సరి చూసుకున్న తర్వాత బిల్లు చెల్లింపులు చేయించుకుంటున్నారు. విజయవాడలోని ‘స్పెన్సర్ మాల్’లో ఈ విధానం ప్రారంభించారు.