వారి ఆస్తులు పెరుగుతున్నాయి కానీ..: పవన్
ABN , First Publish Date - 2020-05-18T00:20:22+05:30 IST
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా నేతలతో
విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర నాయకుల ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయి కానీ.. ప్రజలు అభివృద్ధి చెందడం లేదన్నారు. జనసేన నాయకులకు వ్యాపార బంధాలు లేవు కాబట్టే ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడగలుగుతున్నామని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు.