జడ్జిలపై అనుమానాలున్నాయి
ABN , First Publish Date - 2020-09-24T07:38:42+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ సానుకూలంగా జరిగిందని ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ అన్నారు.
సుప్రీంకోర్టు, ప్రధాని మౌనం ఎందుకు?
వైసీపీ ఎంపీలు పిల్లి, మోపిదేవి ప్రశ్న
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ సానుకూలంగా జరిగిందని ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ భేటీపై ప్రతికూలంగా వచ్చిన వార్తల్లో నిజంలేదన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు చేసిన నిధులు విడుదల చేయించాలని, పునర్విభజన హామీలన్నీ నెరవేర్చాలని జగన్ కోరారు’’ అని తెలిపారు.
‘‘న్యాయవ్యవస్ధపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉంది? ప్రధా ని కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడంలేదు’’ అని సుభాష్ వ్యాఖ్యానించారు.