పర్యాటకానికి గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2020-09-05T09:19:40+05:30 IST
కొవిడ్ కారణంగా ఐదునెలలుగా మూతబడిన పర్యాటక కార్యకలాపాలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది.
అందుబాటులోకి రానున్న బోటింగ్, రోప్వే
అమరావతి/విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ కారణంగా ఐదునెలలుగా మూతబడిన పర్యాటక కార్యకలాపాలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అన్నిరకాల కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసినట్టు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటింగ్ యూనిట్లు, రోప్వే ఆపరేషన్లు, ఆడ్వేంచర్ స్పోర్ట్స్, ట్రావెల్స్, పర్యాటక కేంద్రాలను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ కార్యదర్శి రజిత్ భార్గవ్ ఏపీటీడీసీ ఎండీకి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ ప్రవీణ్కుమార్ తెలిపారు.