ప్రధానికి ఫిర్యాదు చేస్తాం: జేపీ వల్లూరి
ABN , First Publish Date - 2020-05-17T10:37:48+05:30 IST
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఉద్యోగాలూ తీయవద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం..
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి):ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఉద్యోగాలూ తీయవద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై ప్రధానికి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని జాతీయ లేబర్ బోర్డు చైర్మన్ జేపీ వల్లూరి హెచ్చరించారు.