బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా హేమంగ్
ABN , First Publish Date - 2020-07-15T08:45:39+05:30 IST
ఐపీఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఓఓ) హేమంగ్ అమిన్ బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి ...
ముంబై: ఐపీఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఓఓ) హేమంగ్ అమిన్ బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి సీఈఓను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తుంది. అప్పటివరకు హేమంగ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తారు. వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొత్త సీఈఓ నియామకంపై చర్చించి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు.