అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2020-12-25T04:22:57+05:30 IST

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?
మృతుడు షరీ్‌ఫ(ఫైల్‌ )

మతిస్థిమితం లేని యువకుడు అనుమానాస్పద మృతి

ఖానాపురం, డిసెంబరు 24: బుధరావుపే టకు చెందిన మతిస్థిమితం సరిగాలేని, అం ధుడు వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందా డు. పోలీ్‌సలు, గ్రామస్థుల కథనం ప్రకారం ఇందిరమ్మ–1 కాలనీకి చెందిన షేక్‌ లతీ్‌ఫషరీ్‌ఫ–జానీబీ దంపతులకు నలుగురు కుమారులు. చిన్న కుమారుడు షరీఫ్‌(30) పుట్టుకతోనే అంధుడు, పైగా మతిస్థిమితం సరిగాలేని వాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో షరీఫ్‌ తల్లితోపాటే ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసి తల్లితోపాటు ఒకే గదిలో పడుకొన్నారు. గురువారం తెల్లవారు జామున మెలకువవచ్చిన తల్లి చూడ గా షరీఫ్‌ కనిపించలేదు. ఇంటికి అర కిలోమీటరు దూరం లో ఉన్న జమాయిల్‌ తోట సమీపంలోని వ్యవసాయ బావి లో షరీఫ్‌ మృతదేహం తేలి ఉండడాన్ని  గ్రామస్థులు గుర్తించారు. పోలీ్‌సలు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరి సహాయం లేనిదే ఇంట్లో నుంచి బయటకు రాని షరీఫ్‌, అర కిలోమీట రు దూరంలో మడికట్లలో ఉన్న బావి వద్దకు ఎలా వెళ్లాడా నే దానిపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-25T04:22:57+05:30 IST