ఐఐఎం-అహ్మదాబాద్లో చౌటుప్పల్ విద్యార్థికి సీటు
ABN , First Publish Date - 2020-05-09T10:24:40+05:30 IST
చౌటుప్పల్ మండలం నాగారం గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి క్యాట్ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రతిష్టాత్మకమైన ఐఐఎం-అహ్మదాబాద్లో సీటు సాధించారు. ఐఐఎం-అహ్మదాబాద్ ఇంటర్వ్యూ
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మండలం నాగారం గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి క్యాట్ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రతిష్టాత్మకమైన ఐఐఎం-అహ్మదాబాద్లో సీటు సాధించారు. ఐఐఎం-అహ్మదాబాద్ ఇంటర్వ్యూ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో హేమంత్ 99.13 శాతం మార్కులు సాధించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హేమంత్.. టీసీఎ్సలో ఉద్యోగం చేస్తూ క్యాట్ పరీక్షకు సిద్ధమయ్యారు.