మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతికి కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2020-05-10T21:13:25+05:30 IST
మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించారు. రత్నాకర్ రావు అంత్యక్రియలు అధికార లాంచణాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.