దాశరథి స్ఫూర్తిని కొనసాగిస్తాం
ABN , First Publish Date - 2020-07-22T09:00:18+05:30 IST
దాశరథి స్ఫూర్తిని కొనసాగిస్తాం
- సీఎం కేసీఆర్ నివాళి
హైదరాబాద్, జూలై 21(ఆంధ్రజ్యోతి): దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయనకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. దాశరథి అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.