సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీ ఎంట్రీ
ABN , First Publish Date - 2020-06-25T14:15:42+05:30 IST
సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీ ఎంట్రీ
మంచిర్యాల: సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీ ఎంట్రీ ఇచ్చారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రేపు సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న సమ్మెకు టిబిజికేఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అనుబంధ టిబిజికేఎస్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2 నుంచి మూడు రోజుల సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు కార్యాచరణను రూపొందించాయి.