సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఇంద్రసేనారెడ్డి పిల్
ABN , First Publish Date - 2020-03-21T09:35:41+05:30 IST
సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ తీర్మానాన్ని కొట్టివేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన వారికి చికిత్స అందించి, కేసులు నమోదు చేయాలన్నారు.