నేడు ఇంటర్ సిలబస్ విడుదల
ABN , First Publish Date - 2020-09-21T07:20:39+05:30 IST
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ ఈసారి 30శాతం మేర తగ్గనుంది. ఆన్లైన్లోనే తరగతులు నడుస్తుండడంతో
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ ఈసారి 30శాతం మేర తగ్గనుంది. ఆన్లైన్లోనే తరగతులు నడుస్తుండడంతో సిలబస్ తగ్గించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. 11, 12వ తరగతుల విద్యార్థులకు సీబీఎ్సఈ 30శాతం సిలబ్సను తగ్గించింది. ఇంటర్ బోర్డు సైతం 30శాతం సిలబ్సను తగ్గిస్తామని రెండు నెలల క్రితమే ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్లోని అన్ని సబ్జెక్టుల్లో 30 శాతం సిలబస్ తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాల వివరాలను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేయనుంది.