గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం..రూ.10 వేలు జరిమానాతో పాటు..
ABN , First Publish Date - 2020-05-09T14:54:11+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో బెల్ట్షాప్లను నిషేధించారు. నిషేధాలకు వ్యతిరేకంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో బెల్ట్షాప్లను నిషేధించారు. నిషేధాలకు వ్యతిరేకంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం విక్రయించే వారికి 10వేలు జరిమానాతో పాటు సంక్షేమ పథకాలు నిలిపివేయనున్నారు. అలాగే నల్ల కనెక్షన్ కూడా తొలగిచే విధంగా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకుంది. ఈ విషయాన్ని గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.