లాక్డౌన్కు ప్రజల సహకారం : సీపీ
ABN , First Publish Date - 2020-05-08T07:57:13+05:30 IST
ప్రజలు లాక్డౌన్ నిబంధనలను స్వచ్ఛంధంగా అమలు చేస్తూ, పూర్తి సహకారం అందిస్తున్నారని పోలీసు కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్ అన్నారు.
ఖమ్మంక్రైం,మే7: ప్రజలు లాక్డౌన్ నిబంధనలను స్వచ్ఛంధంగా అమలు చేస్తూ, పూర్తి సహకారం అందిస్తున్నారని పోలీసు కమిషనర్ తఫ్సీర్ఇక్బాల్ అన్నారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు సడలింపు సందర్భంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల దుకాణాలను సందర్శించారు.
ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తున్నారని చెప్పారు. సాయంత్రం 6గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సీపీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మురళీధర్, ఏసీపీలు వెంకటరెడ్డి, రమేష్, సీఐ లు తుమ్మా గోపి, బరపటి రమేష్, శ్రీధర్, పాల్గొన్నారు.