అంబాసత్రం ఆధ్వర్యంలో రామయ్యకు రాపత్తు సేవ
ABN , First Publish Date - 2020-12-27T05:14:52+05:30 IST
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రాపత్తు సేవల్లో భాగంగా శనివారం అంబాసత్రం వారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ నిర్వహించారు.
భద్రాచలం, డిసెంబరు 26: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రాపత్తు సేవల్లో భాగంగా శనివారం అంబాసత్రం వారి ఆధ్వర్యంలో రాపత్తుసేవ నిర్వహించారు. తొలుత స్వామి వారిని ఆలయం నుంచి చిత్రకూట మండపంలో వేదికపై తీసుకొచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబాసత్రం మేనేజరు మఽధు, అర్చకులు యామజాల సీతారామయ్య, యామజాల శశికాంత శర్మ పాల్గొన్నారు.