రైతుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం
ABN , First Publish Date - 2020-05-30T08:36:19+05:30 IST
రైతుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం
నిజామాబాద్, మే 29: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఎప్పుడు ఏ పంటలు వేయాలో బాగా తెలుసని, ప్రభుత్వం మాత్రం కొత్త విధానాన్ని అలవంబింంచే ప్రయత్నం చేస్తోందన్నారు.